కార్తీక మాస సందర్భంగా శ్వేతర్కమూల గణపతి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగ లింగేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అభిషేకములను నిర్వహించారు. ఉదయం 6గంటలకు రుద్రాభిషేకం జరిపి భక్తులకు విశేష దర్శనము ఇవ్వబడింది. ఇందులో శివుడికి పంచామృతములతో,పంచవర్ణోదకములతో,సహస్రధారాలతో అభిషేకము జరిగింది. ఇందులో ఇనవూలు సాయి కృష్ణ శర్మ కల్యాణి దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం జరిపిన ఆకాశదీప ఆరంభ పూజలో మరియు కార్తీకపురాణ పఠనం జరుపబడింది.
ఈ నెల్లాళ్ళు ప్రతి సాయంత్రం 6.30ని.లకు ఆకాశదీపారాధన,పురాణ పఠనం జరుగుతుంది
ఇట్లు
ఐనవోలు వెంకటేశ్వర్లు శర్మ
దేవాలయ వ్యవస్థాపక ఛైర్మెన్